అందానికే అసూయపుట్టిస్తుంటుంది అనసూయ. ఇద్దరు పిల్లల తల్లైన కూడా ఇప్పటికీ గ్లామర్తో కేక పెట్టిస్తుంది. యాంకర్గానే కాకుండా నటిగాను ప్రేక్షకులని అలరిస్తున్న అనసూయ మే 7న థ్యాంక్ యూ బ్రదర్ అనే చిత్రంతో ప్రేక్షకులని అలరించేందుకు సిద్దమైంది. థియేటర్లో ఈ సినిమాను విడుదల చేయాలని భావించినప్పటికీ, కరోనా వలన ఆహలో విడుదల చేస్తున్నారు.చిత్రంలో అశ్విన్ విరాజ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. రమేష్ రాపర్తి దర్శకత్వంలో థ్రిల్లర్గా ఈ సినిమా తెరకెక్కుతోంది.చిత్రానికి గుణ బాలసుబ్రమణ్యం ఈ సినిమాకి సంగీతం అందించారు. అనసూయ ప్రెగ్నెంట్ లేడీగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని జస్ట్ ఆర్డినరీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్నాథ్ బొమ్మిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
సినిమాలతోనే కాకుండా గ్లామర్ షోతోను అభిమానులని రంజింపజేస్తున్న అనసూయ తాజాగా రెడ్ కలర్ టాప్, టోన్ జీన్స్ ధరించి యువతకు కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. ప్రస్తుతం అనసూయ ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఎప్పుడు ట్రెండింగ్ సెట్ చేసే అనసూయ తన స్టైల్తో అదరగొడుతూనే ఉంటుంది. ప్రస్తుతం ఈ అమ్మడు ఖిలాడి, రంగమార్తాండ, పుష్ప చిత్రాలతో బిజీగా ఉంది.
ఇవికూడా చదవండి..