ఎదులాపురం, ఆగస్టు 9 : ఓటుకు నోటు కేసులో టీ-పీపీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, నకిలీ పాస్పోర్టు కేసులో జైలుకు వెళ్లిన ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావులకు ఆదివాసీల గురించి మాట్లాడే నైతిక హక్కులేదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న విమర్శించారు. సోమవారం ఆదిలా బాద్లోని జనార్దన్రెడ్డి గార్డెన్లో జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సభలో ఆయన మాట్లాడారు. నాడు కాంగ్రెస్, నేడు బీజేపీ ప్రభుత్వాలు ఆదివాసీలను మోసం చేస్తూనే ఉన్నాయన్నారు. 1981లో గిరిజనులను పోలీసులతో చంపించిన సంస్కృతి కాంగ్రెస్ వాళ్లదేనని, ఇప్పుడు అదే స్థలం వద్ద దండోరా నిర్వహించడం సిగ్గు చేటన్నారు. ఆదివాసీలకు అండగా ఉండాల్సిన రేవంత్రెడ్డి మానిన ఇంద్రవెల్లి నెత్తుటి గాయాన్ని గుర్తుచేసేలా దండోరా నిర్వహిస్తున్నారని ధ్వజమెత్తారు. గత పాలకులు ఇంద్రవెల్లి స్తూపం వద్దకు రావడానికి ఆంక్షలు విధించగా.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడ ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా నివాళులర్పిస్తున్నారని గుర్తుచేశారు.