వరంగల్ : కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ మా హక్కు.. మీరు ఇచ్చేదేం కాదు అని బీజేపీ నేతలను ఉద్దేశించి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. వరంగల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడారు. కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేనమి చెప్పాలి గానీ.. అస్సలే రాదనడానికి మీరు ఎవరు? అని ప్రశ్నించారు. అన్ని కోచ్ ఫ్యాక్టరీలు ఉత్తర భారతదేశంలో ఎందుకు ఉండాలి? ఎందుకు దక్షిణ భారతదేశంలో, తెలంగాణలో ఉండకూడదు? అని ప్రశ్నల వర్షం కురిపించారు. కోచ్ ఫ్యాక్టరీ కోసం పోరాటం చేస్తామని బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు.