రామచంద్రాపురం/సంగారెడ్డి : పఠాన్చెరు నియోజకవర్గంలో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతామని శాసనమండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి అన్నారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ఈదుల నాగులపల్లి లో రూ.1.70 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ లలితా సోమిరెడ్డితో కలిసి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బడుగు, బలహీన వర్గాల ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు దేశానికే రోల్ మోడల్ గా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజా అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు.
అనంతరం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. పఠాన్చెరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తూ ముందుకు నడుస్తున్నామని తెలిపారు. కార్యక్రమాల్లో మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు గౌడ్, ఆయా వార్డుల కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
అలా చేస్తే పరిశ్రమల భూ కేటాయింపులు రద్దు చేస్తాం
దారుణం : భూపాలపల్లిలో సింగరేణి కార్మికుడి హత్య
Earth Photo : చంద్రమండలం నుంచి ఫొటో దిగిన భూమి
బీజేపీ అంటే బిగ్ జోకర్స్ పార్టీ