హుజూరాబాద్టౌన్, సెప్టెంబర్ 17: దేశంలో ఎకడా లేని విధంగా తెలంగాణలో దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి దళితుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నందుకు కృతజ్ఞతగా హుజూరాబాద్లో సీఎం కేసీఆర్కు గుడితోపాటు పైలాన్ నిర్మిస్తామని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి పేర్కొన్నారు. ఇందుకు స్థలం కేటాయించాలని కోరుతూ.. శుక్రవారం ఆయన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఆర్డీవో కార్యాలయంలో అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్లాల్ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో పిడమర్తి రవి మీడియాతో మాట్లాడారు. గుడితోపాటు పైలాన్ నిర్మించేందు కు స్థలం కోసం కలెక్టర్, తాసిల్దార్ను కలు స్తామని చెప్పా రు. స్థలం కేటాయిం పు తర్వాత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో భూమిపూజ చేయిం చి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇచ్చి మెరుగైన జీవనోపాధి పొందడానికి దళితబంధు పథకం ఎంతో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. ఇందుకు కృత జ్ఞతగా సీఎం కేసీఆర్కు గుడి కట్టి తీరుతామన్నారు. ఆయన వెంట మాదిగ హకుల పరిరక్షణ సమితి (ఎంహెచ్పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు మైస ఉపేందర్మాదిగ, మాదిగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ కొడారి ధీరన్, దళిత ఐక్యవేదిక నాయకుడు చిలుక సంతోష్ ఉన్నారు.