తిరువనంతపురం: కేరళలో లెఫ్ట్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్డీఎఫ్) లీడింగ్లో ఉంది. సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి .. ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమి యూడీఎఫ్పై ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నది. ఎల్డీఎఫ్ 81 స్థానాల్లో, యూడీఎఫ్ 54 స్థానాల్లో లీడింగ్లో ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. ధర్మదం నుంచి సీఎం విజయన్ లీడింగ్లో ఉన్నారు. ఆయన గెలుపు ఖాయంగా తోస్తోంది. ఇక కేరళలో బీజేపీ కూడా కొంత మెరుగైన ప్రదర్శన ఇచ్చింది. నాలుగు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు లీడింగ్లో ఉన్నారు. మెట్రోమ్యాన్ శ్రీధరన్ పాలక్కడ్ నియోజకవర్గంలో ఆధిక్యంలో ఉన్నారు. ఆయన ఇప్పటికే వెయ్యి ఓట్ల లీడింగ్లో ఉన్నారు.