ఆర్కేపురం, జూలై 10: ఎస్సీ వర్గీకరణ చేపట్టి మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్చేస్తూ ఈ నెల 26, 27 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని మాదిగ జేఏసీ వ్యవస్థాపకుడు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి పేర్కొన్నారు. శనివారం ఎల్బీనగర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా వర్గీకరణ అంశాన్ని పక్కన పెట్టి మాదిగలకు చేస్తున్న మోసాన్ని ఎండగడుతూ ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిరసన దీక్ష, ధర్నా చేపట్టనున్నట్టు చెప్పారు. ఎన్నికల ముందు మాదిగలకు రిజర్వేషన్లు కల్పిస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం మాటమార్చి రిజర్వేషన్ల గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో మాదిగ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొండమీద గోవిందరావు, రంగారెడ్డి జిల్లా యూత్ జేఏసీ అధ్యక్షుడు నక్క శరత్కుమార్, నాయకులు బోరెల్లి సురేశ్, దేవరకొండ నరేశ్, మీసాల మహేశ్ తదితరులు పాల్గొన్నారు.