తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ వికలాంగుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకున్నారు. రూ. 200 ఉన్న పెన్షన్ను రూ. 3016కు పెంచారు. ఈ పెన్షన్తో నా కుటుంబానికి భారం కాకుండా బతకగలుగుతున్నాను. భార్య, పిల్లలకు ఎంతో సాయంగా ఉంటున్నాను. 15 రోజుల క్రితం ఇచ్చిన మూడు చక్రాల సైకిల్తో బయటకు వెళ్లి నిత్యావసర సరుకులు తెచ్చుకోగలుగుతున్నాను. ఇది వరకు చూడలేని బయటి ప్రపంచాన్ని ఇప్పుడు చూస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
– సమ్మయ్య, వికలాంగుడు ( నర్సింగాపూర్ గ్రామం, వీణవంక మండలం )