న్యూఢిల్లీ: ఇస్తాంబుల్(టర్కీ) వేదికగా జరుగుతున్న బోస్పోరస్ బాక్సింగ్ టోర్నీలో తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. గురువారం జరిగిన మహిళల 51కిలోల క్వార్టర్స్ బౌట్లో నిఖత్ 5-0తో నజీమ్ జైబె(కజకిస్థాన్)పై అలవోక విజయం సాధించింది. రెండు సార్లు ప్రపంచ చాంపియన్ అయిన కజక్ బాక్సర్పై ఆధిపత్యం చెలాయించిన నిఖత్ సెమీస్ చేరి కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకుంది.