వనపర్తి : తెలంగాణ ఏర్పాటు తర్వాత ఎక్కడ ఏం చేపట్టాలి అన్నది సీఎం కేసీఆర్కు ముందే అవగాహన ఉందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. తెలంగాణ నవ నిర్మాణం గురించి కేసీఆర్ 2001 లోనే స్పష్టమైన ప్రణాళిక నిర్దేశించుకున్నారని, ఆకలి చావుల తెలంగాణను ఏడేళ్లలో కేసీఆర్ అన్నపూర్ణగా మార్చారన్నారు.
వైద్యం పూర్తిగా ప్రభుత్వ పరిధిలో ఉండాలన్నది సీఎం కేసీఆర్ ఆలోచన. దానిని దృష్టిలో ఉంచుకునే కేసీఆర్ ఆదిలాబాద్, మహబూబ్ నగర్, సూర్యాపేట, సిద్దిపేటలలో నూతన వైద్య కళాశాలలు ప్రారంభించారన్నారు. నూతనంగా వనపర్తితో కలిపి ఆరు మెడికల్ కళాశాలలు, దాంతో పాటు నర్సింగ్ కళాశాలలు మంజూరు చేయడం దేశానికే ఆదర్శమన్నారు.
వనపర్తిలో మెడికల్ కళాశాలతో దక్షిణ పాలమూరు జిల్లాకు వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. 2018 ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్కు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
భద్రాద్రి జిల్లాలో తీరిన ఆక్సిజన్ కష్టాలు : మంత్రి పువ్వాడ
భూపాలపల్లిలో 30 పడకల కొవిడ్ వార్డు ప్రారంభం
అనాథ పిల్లలకు అండగా ఉంటాం: మంత్రి ఐకే రెడ్డి
సీఎం కేసీఆర్ నిర్ణయంతో వైద్య రంగం బలోపేతం
కరోనా ఉగ్రరూపం.. తల్లడిల్లుతున్న యూపీ పల్లెలు
కరోనా పోవాలని ముత్నుర్లో మహిళల పూజలు