జనగామ : బడ్జెట్లో సీఎం కేసీఆర్ ఆర్టీసీకి మూడు వేల కోట్ల రూపాయలు కేటాయించడంతో సర్వత్రా హర్షాతి రేకాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం కేసీఆర్ చిత్రిపటాలకు క్షీరాభిషేకాలతో ఆర్టీసీ సిబ్బంది తమ కృతజ్ఞతను చాటుతున్నారు. జనగామ ఆర్టీసీ డిపోలో మేనేజర్ ఎస్వీజీకే మూర్తి ఆధ్వర్యంలో సిబ్బంది క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రీజినల్ మేనేజర్ మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉద్యోగులందరూ కలిసికట్టుగా పని చేసి అన్ని డిపోలను లాభాల బాటలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. నిధులు కేటాయించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ శ్రీలక్ష్మి ధర్మ, అసిస్టెంట్ మేనేజర్ శ్రీకాంత్, మెకానికల్ సూపర్వైజర్ రాఘవేంద్ర, ఆఫీస్ సూపరింటెండెంట్ రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు.