నాగర్ కర్నూల్ : ఆపదలో ఉండే వారికి ఎల్లప్పుడూ అండగా నిలిచే నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మరోసారి తన గొప్పమ నసును చాటుకున్నారు. పార్టీ కార్యకర్త కుమార్తె గుండె సంబంధిత ఆపరేషన్ కోసం 3 లక్షల రూపాయల చెక్కు అందజేశారు. నాగర్ కర్నూల్ పట్టణంలోని 12వ వార్డుకు చెందిన పార్టీ కార్యకర్త శేషు చారి, దివ్య దంపతుల 2 నెలల కుమార్తె కు గుండెలో రంధ్రం ఉండడంతో వెంటనే ఆపరేషన్ చేయాలి అని డాక్టర్లు సూచించారు.
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సీఎం కేసీఆర్తో మాట్లాడి ఆపరేషన్ కోసం 3 లక్షల రూపాయల చెక్కును మంజూరు చేయించి చిన్నారి తండ్రి శేషు చారికి ఈరోజు హైదరాబాద్ లోని తన స్వగృహంలో అందజేశారు.
ఇవి కూడా చదవండి..
ప్రజా సేవలో పోలీసులు అంకితం కావాలి
మెడికల్ హబ్గా మహబూబాబాద్ : మంత్రి సత్యవతి
ఆనంద్తో చెస్ ఆడనున్న ఆమిర్ ఖాన్