తమిళ నటుడు ఆర్య తెలుగు ప్రేక్షకులకు చాలా సుపరిచితం. ఆయనపై శ్రీలంకకు చెందిన ఓ యువతి కేసు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. వివరాలలోకి వెళితే ఆర్య లాక్ డౌన్ సమయంలో తాను కష్టాలలో ఉన్నానని చెప్పి శ్రీలంక యువతి దగ్గర రూ. 70లక్షలు తీసుకున్నాడట. అంతేకాదు తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడట. ఆర్యకు డబ్బులు పంపిన వివరాలు, ఆయనతో ఫోన్లో మాట్లాడిన రికార్డింగ్స్ కూడా తన వద్ద ఉన్నాయని చెబుతుంది. అయితే ఆర్య ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తుండగా, అతనికి బెయిల్ ఇవ్వొద్దంటూ ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి ,హోం మినిస్టర్ కార్యాలయాలకు లేఖలు కూడా రాశారట సదరు యువతి. అయితే కేసు ప్రస్తుతం కోర్టులో ఉండగా, ఏప్రిల్ 4కు విచారణను వాయిదా వేశారు