హైదరాబాద్ : అమ్ముడుపోని టెక్ట్బుక్స్ను పాత ధరకే విక్రయించేందుకు ప్రభుత్వం అనుమతి తెలిపింది. కరోనా కారణంగా 2020-21లో అమ్ముడుపోని టెక్ట్బుక్స్ను 2021-22 విద్యాసంవత్సరంలో పాత ధరకే అమ్మేందుకు 21 ప్రైవేటు ప్రింటర్లు, ప్రచురణకర్తలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జూన్ 22న ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఒక మెమో జారీ చేసింది. 2020-21 విద్యా సంవత్సరంలో ప్రైవేటు ప్రింటర్లు 35 లక్షల టెక్ట్బుక్స్ను ముద్రించారు. అయితే కొవిడ్ మహమ్మారి కారణంగా వీటిలో కేవలం 17 లక్షల పాఠ్యపుస్తకాలు మాత్రమే అమ్ముడయ్యాయి. ఈ కారణంగా తాజా టెండర్లను ఆహ్వానించకుండా 2021-22 విద్యా సంవత్సరానికి ప్రస్తుత 21 ప్రైవేట్ ప్రింటర్లు / ప్రచురణకర్తలకు సేల్ కాంపోనెంట్ పాఠ్యపుస్తకాలను ముద్రించి పంపిణీ చేసే ఒప్పందాన్ని ప్రభుత్వం పొడిగించింది.