రాజన్న సిరిసిల్ల : విద్య ద్వారనే వికాసం సిద్ధిస్తుందని, విద్య అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లాలోని కొనరావుపేట మండలం మర్రిమడ్ల గ్రామంలో బాల, బాలికల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో అదనపు వసతుల కల్పన పనులకు మంత్రి స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రైవేటు స్కూల్స్ లలో చాలామంది పేదలు చదవలేక బడి మధ్యలో మానేస్తున్నారు.
వీరందరికీ కూడా నాణ్యమైన విద్య అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున గురుకులాలు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. 6.05 కోట్ల రూపాయలతో డార్మెట్రి బ్లాక్, స్టాఫ్ క్వార్టర్స్, హెల్త్ క్లినిక్, పేరెంట్స్ వెయిటింగ్ హాల్, ఇంటర్నల్ సీసీ రోడ్లు, నీటి సరఫరా, పారిశుధ్య వసతులు, అంతర్గత రోడ్ల పనులకు శంకుస్థాపన వేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. స్కూల్కు రోడ్డు సౌకర్యం లేదని తన దృష్టికి వచ్చిందని వెంటనే ఈ సమస్యను పరిష్కరిస్తామని ఆమె హామీనిచ్చారు.
గురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం కూడా అందిస్తున్నాం. ఇందుకోసం ప్రతిరోజూ గుడ్డు, వారానికి 6 సార్లు చికెన్, మటన్ ఇస్తున్నాం. సీఎం కేసిఆర్ మనవడు, మనుమరాలు తినే సన్నబియ్యం ఇక్కడకూడా మన బిడ్డలకు పెడుతున్నామని తెలిపారు. కరోనా వల్ల కొంతకాలం విద్యా సంస్థలు మూతపడ్డాయి. సెప్టెంబర్ 1 నుంచి మళ్లీ ప్రారంభం అవుతున్నాయి. పాఠశాలలు మళ్లీ ప్రారంభం అవుతున్న సందర్భంగా పిల్లలకు ఇచ్చే అన్ని వసతులు కల్పిస్తున్నాం.
స్థానికులు కూడా పర్యవేక్షించాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ కృష్ణ భాస్కర్, జెడ్పీ చైర్ పర్సన్ అరుణ, గిరిజన గురుకుల సంస్థ అధికారులు విజయలక్ష్మి, జ్యోతి, స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Kabul Blasts: శరీర భాగాలు గాల్లోకి ఎగిరిపడ్డాయి.. మురికి కాలువలో రక్తం పారింది!
Sonu Sood: సోనూ సూద్ విన్యాసాలని చూసి ముక్కున వేలేసుకున్న నెటిజన్స్
అసోంలో 7 వాహనాలకు నిప్పుపెట్టిన దుండగులు.. ఐదుగురు మృతి