నల్లగొండ : రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, ఆశలు నెరవేర్చడంలో ఉద్యోగులు ముందుండాలని విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయాణం ఆ దిశగా సాగుతోందని అందుకు అనుగుణంగా ఉద్యోగులు పనిచేస్తే అద్భుతమైన విజయాలు సాధించవచ్చని మంత్రి పేర్కొన్నారు. ఏడో విడత ప్రారంభం కానున్న హరితహారంతో పాటు పల్లెప్రగతి, పట్టణ ప్రగతి, సీజనల్ వ్యాధుల నివారణలపై నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి మూడు జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో సమాజానికి సవాల్ విసురుతున్న పర్యావరణ పరిరక్షణకు ముఖ్యమంత్రి కేసీఆర్ నడుం బిగించారు. అందులో భాగంగానే హరితహారం ప్రారంభించారన్నారు. ఆరు విడతలుగా నిర్వహించుకున్న హరితహారంలో ఇప్పటివరకు అటవీశాఖ కే పరిమితం అనుకున్న మొక్కల పెంపకాన్ని అన్ని శాఖలతో పాటు ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాక గత పాలనకు భిన్నంగా ప్రభుత్వ సేవలను ప్రజల వద్దకు పారదర్శకంగా చేర్చేందుకు గడిచిన ఏడూ సంవత్సరాలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త ఒరవడిని సృష్టించారన్నారు.
ఉద్యోగులకు ప్రభుత్వం నెలవారీగా జీతాలు అందిస్తున్న తరహాలోనే పల్లెప్రగతి, పట్టణ ప్రగతిలకు నిర్ణీత సమయానికి నిధులు పంపిస్తున్నారన్నారు. అటువంటి కార్యక్రమంలో జరుగుతున్న అభివృద్ధి పై కిందిస్తాయిలో అధికారులు తప్పుడు నివేదికలు రూపొందించకుండా చూడాలన్నారు. ఉన్నది ఉన్నట్లుగా నివేదికలు అందించాలని, పనులు పురోగతి లేని పక్షంలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవాన్ని మాత్రమే నివేదిక లలో ఉండాలన్నారు. ఎక్కడ తప్పు జరిగిన చర్యలు కఠినంగా ఉంటాయన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం పల్లెప్రగతి, పట్టణప్రగతి కార్యక్రమాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నారన్నారు. తాను కుడా గ్రామాల వారీగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. కలెక్టర్ లు సైతం గ్రామాల వారీ పర్యటనలు నిర్వహించాలన్నారు.
వచ్చేది వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
నల్లగొండతో పాటు యాదాద్రి, సూర్యాపేట జిల్లాలలోని పురపాలక సంఘాలలో మిషన్ భగీరధ నీటి సరఫరా ను అడిగి తెలుసుకున్నారు.
కార్యక్రమంలో నల్లగొండ జిల్లా జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ,సూర్యాపేట జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి లతో పాటుఅదనపు కలెక్టర్ లు రాహుల్ శర్మ, చంద్రశేఖర్, డి ఎఫ్ ఓ రాంబాబు, డీఆర్డీవో కాళిందిని, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
మోడల్ స్కూళ్లు అధునాతన దేవాలయాలు
కార్మికులకు అండగా నిలిచిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
భూమికి బరువయ్యేంత పంట పండిస్తాం : మంత్రి హరీశ్ రావు
దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్ల పంపిణీ
ఎంపీ వెంకటేష్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ కవిత
ఐసోలేషన్ సెంటర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే కిషోర్ కుమార్