సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రాన్ని కొవిడ్ ఐసోలేషన్ కేంద్రంగా మార్చారు. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటం, దవాఖానల్లో వ్యాక్సిన్లు, మందులు, బెడ్ల కొరతతో ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. చిన్న చిన్న ఇండ్లల్లో ఉండటం, సరైన వసతులు లేకపోవటంతో ఒకరి వల్ల కుటుంబసభ్యులంతా వైరస్బారిన పడుతున్నారని, అలాంటి వాళ్లు సోమవారం నుంచి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని ఐసోలేషన్ కేంద్రాన్ని వినియోగించుకోవాలని పార్టీ నిర్వాహకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.