ఆల్ ఇండియా స్థాయిలో రెండో ర్యాంకు
ప్రతిభ చూపిన నవీన్రెడ్డి
ఉత్తీర్ణత సాధించిన మరో విద్యార్థి అరుణ్కుమార్
సత్తా చాటిన మండలవాసులు
రాయికల్/రాయికల్ రూరల్, మార్చి 23 : చార్టెడ్ అకౌంటెంట్స్(సీఏ) ఫలితాల్లో రాయికల్కు చెందిన రైతు బిడ్డ నూతుల నవీన్రెడ్డి ఆల్ఇండియాలో స్థాయిలో రెండో ర్యాంకు సాధించగా, ఇదే మండలానికి చెందిన మరో విద్యార్థి ఉత్తీర్ణత పొంది మంచి మార్కులు సాధించాడు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్డెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా సీఏ చివరి ఫలితాలను ఆదివారం రాత్రి విడుదల చేయగా, రాయికల్కు చెందిన నవీన్రెడ్డి ఆల్ ఇండియా స్థాయిలో రెండో ర్యాంకు సాధించి తెలంగాణ సత్తాచాటాడు. నూతుల రాజిరెడ్డి-లక్ష్మి దంపతులది వ్యవసాయ కుటుంబం. వీరికి కొడుకు నవీన్రెడ్డి, కూతురు ఉన్నారు. నవీన్ పదో తరగతి వరకు రాయికల్ విశ్వశాంతి హైస్కూల్లో చదివాడు. పదిలో 507 మార్కులు సాధించాడు. కరీంనగర్లోని ట్రినిటీ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ పూర్తి చేశాడు. 950 మార్కులు సాధించాడు. 2014లో సీపీటీ(ఫౌండేషన్) కోర్సు కోసం హైదరాబాద్లోని సీఎంఎస్ కళాశాలలో శిక్షణ తీసుకున్నాడు. సీఏ ఫౌండేషన్ కోర్సులో ఉత్తీర్ణత సాధించి సీపీటీలో 200 మార్కులకు 160 మార్కులు, ఐపీసీసీలో 700 మార్కులకు 394 సాధించి అనంతరం ఆర్టికల్షిప్లో జేఎస్ఎస్ అండ్ సీవోలో మూడేండ్ల పాటు శిక్షణ పొందుతూనే సీఏ ఫైనల్ పరీక్షలకు సన్నద్ధమయ్యాడు. 2019 నవంబర్లో సీఏ ఫైనల్ పరీక్షలు రాయాల్సి ఉండగా, అనారోగ్య కారణాలతో రాయలేకపోయాడు. 2019 మేలో సీఏ ఫైనల్ పరీక్షలు రాసినా ఉత్తీర్ణత సాధించలేదు. 2020లో మేలో జరుగాల్సిన పరీక్షలు కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. చివరగా 2021 జనవరిలో సీఏ ఫైనల్ పరీక్షలు రాశాడు. ఫైనల్ పరీక్షల్లో 800 మార్కులకు 468 సాధించి ఆల్ ఇండియా స్థాయిలో రెండు ర్యాంకును కైవసం చేసుకున్నాడు. కాగా, సీఏ ఫలితాల్లో ఇదే మండలం మైతాపూర్ గ్రామానికి చెందిన చెందిన దొంగ అరుణ్కుమార్ ఉత్తీర్ణత సాధించాడు. అరుణ్కుమార్ 800 మార్కులకు 405 మార్కులు సాధించి సత్తాచాటాడు.
నవీన్రెడ్డి తల్లిదండ్రులకు సన్మానం
సీఏ ఫలితాల్లో జాతీయ స్థాయిలో రెండో ర్యాంకు సాధించిన నవీన్రెడ్డి తల్లిదండ్రులను విశ్వశాంతి ఉన్నత పాఠశాలలో అధికారులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో తహసీల్దార్ మహేశ్వర్, ఎస్ఐ ఆరోగ్యం, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గౌడ్, సహకార సంఘం అధ్యక్షుడు ఏనుగు మల్లారెడ్డి, నాయకులు ఎద్దండి భూమారెడ్డి, మచ్చ నారాయణ, గడ్డం గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.