హైదరాబాద్ : వచ్చే 4 వారాల్లో కరోనా వ్యాప్తి తీవ్రరూపు దాల్చే ప్రమాదముందని, జనం అత్యవసరమైతేనే బయటకు రావాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాస రావు సూచించారు.
రాష్ట్రంలోనూ కరోనా వేగంగా విస్తరిస్తోందని ఆయన తెలిపారు. సెకండ్ వేవ్లో వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నదని చెప్పారు. బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు.
రోగుల సంఖ్య పెరిగితే అందరికీ పడకలు దొరకడం కష్టమని అభిప్రాయ పడ్డారు. వచ్చే 4 వారాలు దేశానికి, రాష్ట్రానికి చాలా కీలకమని అన్నారు. ప్రజంతా విధిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు.
గత కొంతకాలంగా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
అన్ని దవాఖానల్లో సాధారణ వైద్య చికిత్సలతోపాటు కరోనా బాధితులకు చికిత్స అందించేలా చర్యలు చేపట్టింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి