సొంత ఆదాయం రూ.183.52కోట్లు
గ్రాంట్ల రూపంలో రూ. 375.15కోట్లు
గతేడాది కంటే పెరిగిన పద్దు
కార్పొరేషన్ ప్రత్యేకాధికారి, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు ఆమోదం
వరంగల్, మార్చి 27 : అంకెల గారడీ లేకుండా.. ఊహల పల్లకిలో ఊరేగకుండా బల్దియా బడ్జెట్ను రూపొందించింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ. 559.77 కోట్లతో రూపొందించిన బడ్జెట్ను కార్పొరేషన్ ప్రత్యేకాధికారి, జిల్లా కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు శనివారం ఆమోదించారు. గత ఏడాది కంటే ఈ ఏడాది బడ్జె ట్ అంచనాలు రూ. 254 కోట్లు పెరిగాయి. బల్దియా సొం త ఆదాయంతో పాటు గ్రాంట్లు ఈ ఏడాది ఎక్కువ వస్తాయని బడ్జెట్లో లెక్క కట్టారు. బల్దియాకు వచ్చే వాస్తవ ఆదాయం, గ్రాంట్ల నిధులనే అభివృద్ధికి కేటాయించారు. సొంత ఆదాయంలో 10 శాతం గ్రీన్ బడ్జెట్గా కేటాయించారు. 42 వీలీన గ్రామాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధు లు కేటాయించారు. గతంలో కంటే ఈ ఏడాది కరంట్ బిల్లులు భారీగా తగ్గాయి. సుమారు రూ. 5 కోట్లు తగ్గినట్లు బడ్జెట్ కేటాయింపులు స్పష్టం చేస్తున్నాయి.
కలెక్టర్ ఆమోదముద్ర..
2021-22 ఆర్థిక సంవత్సరానికి బల్దియా రూ. 559.77 కోట్లతో రూపొందించిన బడ్జెట్కు కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు ఆమోదముద్ర వేశారు. సొంత ఆదా యం రూ. 183.52 కోట్లుగా చూపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే గ్రాంట్లు రూ. 375.15 కోట్లుగా లెక్క వేశారు. సొంత ఆదాయంలో ఆస్తి పన్నుల ద్వారా రూ.80 కోట్లు, మున్సిపల్ ఆస్తుల కిరాయిల ద్వారా రూ.19.50 కోట్లు, భవన నిర్మాణ అనుమతుల ద్వారా రూ. 57.30 కోట్లు, ట్రేడ్ లైసెన్స్ ఫీజుల ద్వారా రూ. 7.70 కోట్లు, నల్లా పన్నుల ద్వారా రూ.19.02 కోట్లు వ స్తాయని బడ్జెట్లో చూపారు. గ్రాంట్లుగా చూపిన రూ. 375.15 కోట్లలో15వ ఆర్థిక సంఘం నిధులు, పట్టణప్రగతి ద్వారా రూ. 90కోట్లు వస్తాయని బడ్జెట్లో చూపా రు. ప్లాన్ గ్రాంట్లో ఎస్సీ, ఎస్టీ, ట్రైబల్, మైనార్టీ సబ్ప్లాన్, స్వచ్ఛభారత్ మిషన్, సీఎంఏ పథకాల ద్వారా రూ. 275.30 కోట్లు వస్తాయని అంచనా వేశారు. నియోజవర్గ అభివృద్ధి, స్పెషల్ డెవలప్మెంట్, ఎంపీ ల్యాండ్స్ నిధులను రూ. 9.85 కోట్లుగా చూపారు. అయితే ఆదాయంతో పాటు తప్పనిసరి ఖర్చులుగా బడ్జెట్లో రూ. 112.20 కోట్లుగా చూపారు. వేతనాలకు రూ.62 కోట్లు, పారిశుధ్య నిర్వహణకు రూ.15.55 కోట్లు, కరంట్ బిల్లులకు రూ. 16.30 కోట్లు, గ్రీన్ బడ్జెట్కు రూ. 18.35 కో ట్లు తప్పనిసరి ఖర్చుగా చూపారు. రూ. కోటి 10 లక్షలు డిపాజిట్స్, అడ్వాన్స్లుగా బడ్జెట్లో చూపారు.
విలీన గ్రామాల అభివృద్ధికి రూ.9.37 కోట్లు..
గ్రేటర్లో విలీన గ్రామాల అభివృద్ధికి జీతాలు, కరంట్ బిల్లులు, పాలన నిర్వహణ ఖర్చులు పోనూ మిగిలిన బడ్జెట్లో 1/3 శాతం రూ.9.37 కోట్లు కేటాయించారు. రోడ్ల అభివృద్ధికి రూ. 4 కోట్లు, డ్రైనేజీలు, కల్వర్టుల నిర్మణం కోసం రూ. 4 కోట్లు, తాగునీటి సరఫరాకు రూ.75 లక్ష లు, ఇతర వసతుల కోసం రూ.62 లక్షలు కేటాయించా రు. వైకుంఠధామాల అభివృద్ధికి రూ. 50 లక్షలు, పార్కు లు, ఆటస్థలాలకు రూ. 50 లక్షలు, పబ్లిక్ టాయ్లెట్ల ని ర్మాణానికి రూ. 50 లక్షలు, వెజ్, నాన్ వెజ్ మార్కెట్లకు రూ.50 లక్షలు, జంతు వధశాలల కోసం రూ. 50 లక్ష లు, డంపింగ్ యార్టుల అభివృద్ధి కోసం రూ. 50 లక్షలు, స్ట్రీట్ వెండింగ్ జోన్స్ కోసం రూ. 50 లక్షలు, ఓపెన్ జి మ్స్ ఏర్పాటు కోసం రూ. 50 లక్షలు కేటాయించారు. న గరంలో వాటర్ పైప్లైన్ లీకేజీల మరమ్మతుల కోసం రూ. కోటి, రోడ్ల నిర్మాణం కోసం రూ. 6.22 కోట్లు, డ్రైనేజీలు, కల్వర్టుల నిర్మాణం కోసం రూ. 4.26 కోట్లు, వీధి దీపాల ఏర్పాటుకు రూ. కోటి, కార్యాలయాల మరమ్మతులు, ఫర్నిచర్ కోసం రూ. 2.26 కోట్లు కేటాయించారు.
గ్రాంట్ల రూపేన రూ. 375.15 కోట్లు..
గ్రేటర్ కార్పోరేషన్కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రాంట్ల రూపేన రూ. 375.15 కోట్ల నిధులు వస్తాయని బడ్జెట్లో చూపారు. నాన్ ప్లాన్ గ్రాంట్స్గా రూ. 90 కో ట్లు, ప్లాన్ గ్రాంట్గా 275.30 కోట్లు, ఇతర గ్రాంట్గా రూ.9.85 కోట్లు చూపారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా రూ.45.25 కోట్లు వస్తాయని పేర్కొన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో పాటు, ఎంపీ ల్యాండ్స్ ద్వారా ఈ ని ధులు వస్తాయని బడ్జెట్లో పొందుపర్చారు. రాష్ట్ర ప్రభు త్వం ద్వారా 329.90 కోట్లు గ్రాంట్గా వస్తుందని చూపా రు. ఇటీవల రాష్ట్ర బడ్జెట్లో గ్రేటర్ కార్పొరేషన్కు కేటాయించిన రూ. 250 కోట్ల నిధులతో పాటు పట్టణ ప్రగతి, సీడీపీ, ఎస్డీపీ గ్రాంట్లు వస్తాయని బడ్జెట్లో చూపారు.