నమస్తే తెలంగాణ నెట్వర్క్: టీఆర్ఎస్లో చేరికల జోరు కొనసాగుతున్నది. జమ్మికుంట మండలం పాపక్కపల్లి, శంభునిపల్లికి చెందిన 100 మంది ఎమ్మెల్యే అరూరి రమేశ్ సమక్షంలో పార్టీలో చేరారు. హుజూరాబాద్ మండలం సింగాపూర్కు చెందిన 50 మంది బీజేపీ నాయకులు ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ సమక్షంలో, వీణవంక మండలం మల్లన్నపల్లి ఉప సర్పంచ్ వీరయ్యతోపాటు బీజేపీ కార్యకర్తలు, నర్సింగాపూర్కు చెందిన మరో 30 మంది నాయకులు ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం మాదన్న పేట, శ్రీరాంలపల్లికి చెందిన ముదిరాజ్, పెరిక కులస్థులు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.