సూర్యాపేట టౌన్, జూలై 8: తెలంగాణ రైతుల హక్కులకు భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకునేది లేదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఏపీ సర్కార్ను హెచ్చరించారు. పోతిరెడ్డిపాడు కాల్వ వెడల్పును నిలువరించడంతోపాటు ఆర్డీఎస్ కాల తవ్వకాలను ఆపాలని డిమాండ్ చేశారు. గురువారం సూర్యాపేటలో జడ్పీ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ ఆధ్వర్యంలో ఆత్మకూర్.ఎస్ మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు 120 మందితోపాటు ఆర్యవైశ్య ప్రతినిధులు వందమంది టీఆర్ఎస్లో చేరారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. లిప్టులతో నీళ్లను దోచుకున్న చరిత్ర ఏపీ సర్కార్దేనని విమర్శించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ నిండి ప్రవహించినప్పుడు మాత్రమే వాటిని వరద జలాలు అంటారని, దిగువన ఉన్న నీటిని లిప్టుల ద్వారా ఎత్తిపోసుకునే పద్ధతిని వరద కాల్వలు అంటారా? అని ఆయన ఆంధ్రా సర్కార్ను ప్రశ్నించారు. వరద జలాలను తీసుకుపోతామని చెప్పి దొంగతనంగా ప్రాజెక్టుల నీటిని దోచుకుపోతున్నారని మండిపడ్డారు. ఇక్కడ ఉన్నది సీఎం కేసీఆర్ అని.. ఇది తెలంగాణ రాష్ట్రమని.. ఇక్కడి ప్రజలకు భంగం కలిగిస్తే ఎంత మాత్రం సహించేదిలేదని మంత్రి హెచ్చరించారు.
టీఆర్ఎస్లో వంద మంది చేరిక
వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలోని నేరెళ్ల, అంబాల గ్రామాలకు చెందిన వందమంది కాంగ్రెస్, బీజేపీ నాయకులు టీఆర్ఎస్లో చేరగా.. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు.