ఢిల్లీ : జూలై 2021 సెషన్కు ఫెలోషిప్ ప్రోగ్రాం ప్రవేశ పరీక్ష స్టేజ్-1 ఫలితాలను ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) ప్రకటించింది. స్టేజ్ 1 పరీక్షను కంప్యూటర్ ఆధారిత పరీక్షగా (సిబిటి) ఏప్రిల్ 17 న నిర్వహించారు. మొదటి దశలో అర్హత సాధించిన విద్యార్థులు రెండవ దశలో డిపార్ట్మెంటల్ క్లినికల్, ప్రాక్టికల్ లేదా ల్యాబ్-బేస్డ్ అసెస్మెంట్కు హాజరు కావాల్సి ఉంటుంది. ఇది వీడియో కాన్ఫరెన్సింగ్ మోడ్ ద్వారా జరుగుతుంది.
ప్రతి ఫెలోషిప్ ప్రోగ్రాం కింద రెండవ దశ తేదీలు సూచించబడతాయి. వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్ఫాం, అసెస్మెంట్ సమయం, ఇతర వివరాలను అభ్యర్థులకు వారి రిజిస్టర్డ్ ఈ మెయిల్ ఐడికి సంబంధిత విభాగాలు తెలియజేయనున్నట్లు అధికారిక ప్రకటన తెలిపింది. షార్ట్లిస్ట్ చేసిన అభ్యర్థులు తమ సర్టిఫికెట్ల స్కాన్ కాపీలను ఏప్రిల్ 30 వరకు ఎయిమ్స్ అధికారిక వెబ్సైట్ aiimsexams.ac.in లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
రిజల్ట్ డాక్యుమెంట్లో అవసరమైన ధృవీకరణ పత్రాల వివరాలను వెల్లడించింది. ఒకవేళ ఏప్రిల్ 30, శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు సంబంధిత పత్రాలు అప్లోడ్ చేయకపోతే, అభ్యర్థిత్వాన్ని రద్దు చేసుకున్నట్లుగా లేదా ఉపసంహరించుకున్నట్లుగా పరిగణించబడుతుందని ఎయిమ్స్ పేర్కొంది.