హైదరాబాద్ : భద్రాద్తి కొత్తగూడెం జిల్లా గుండాల మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా పని చేస్తున్న గంట వెంకటరావు (47) కరోనాతో సోమవారం కన్నుమూశారు. మూడు రోజుల కిందట ఎంపీడీఓ కరోనా బారినపడ్డారు. దీంతో ఆయన సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నారు. ఈ క్రమంలో అస్వస్థతకు గురికావడంతో చికిత్స కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్కు తరలిస్తుండగా పరిస్థితి విషమించి కన్నుమూశారు. ఆయన మృతికి పలువురు అధికారులు, నాయకులు సంతాపం ప్రకటించారు.