గట్టు, మార్చి 28 : మండల కేంద్రంలోని టీఎస్డబ్ల్యూ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల, కళాశాల వచ్చే ఏడాది నుంచి సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ(సీవోఈ) కళాశాలగా మారనున్నది. ఇందుకు సంబంధించి సాంఘిక సంక్షేమ గురుకులాల రాష్ట్ర కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఈనెల 26న ఆదేశాలు జారీ చేశారు. ఐఐటీ, నీట్, ఐఐఐటీ, నీట్ వంటి పోటీ పరీక్షలు ఎదుర్కొనేందుకు వీలుగా విద్యార్థులకు మెరుగైన విద్యను ఇక్కడ బోధించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ గురుకులంలో ఉన్న వసతులు, ఇప్పుడు పనిచేస్తున్న, అవసరమయ్యే బోధనా సిబ్బంది వివరాలు అందించాలని సొసైటీ మహబూబ్నగర్ రీజినల్ కోఆర్డినేటర్ను ఆదేశించారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
ఇవి కూడా చదవండి
వేసవిలో వచ్చే గ్యాస్ సమస్యలకు ఇలా చెక్ పెట్టండి..!