ఖైరతాబాద్, సెప్టెంబర్ 4: నిమ్స్ దవాఖానలో నూతనంగా ఏర్పాటుచేసిన పీడియాట్రిక్ ఆంకాలజీ క్లినిక్ను మెడికల్ సూపరింటెండెంట్ ఎన్ సత్యనారాయణ, డీన్ రామ్మూర్తితో కలిసి డైరెక్టర్ డాక్టర్ కే మనోహర్ శనివారం ప్రారంభించారు. నిమ్స్ అసోసియేట్ డీన్, ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ జీ సదాశివుడు మాట్లాడుతూ.. పిల్లలకు క్యాన్సర్ చికిత్స కొనసాగుతున్నదని, తాజాగా వారికోసం ప్రత్యేక క్లినిక్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ క్లినిక్ బుధ, శనివారాల్లో అందుబాటులో ఉంటుందని చెప్పారు. మంగళవారం గైనకాలజిక్ ఆంకాలజీ, గురు, శుక్రవారాల్లో మాలిగ్నెంట్ హెమటాలజీ, శనివారం సర్వైవర్షిప్ క్లినిక్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.