Telangana
- Jan 02, 2021 , 01:08:34
బియ్యం వ్యాపారిపై పీడీయాక్టు

హన్మకొండ సిటీ, జనవరి 1: రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యాపారిపై శుక్రవారం జనగామ జిల్లా రఘునాథపల్లిలో పీడీ యాక్టు నమోదైంది. వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలం శంభునిపల్లికి చెందిన స్వణాకర్ అలియాస్ రమేశ్ కరీంనగర్, సిద్దిపేట జిల్లాల్లో రేషన్ బియ్యం దందా చేస్తున్నాడు. గతేడాది సెప్టెంబర్ 14న 250 క్వింటాళ్ల బియ్యాన్ని లారీలో రఘునాథపల్లికి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇదే తరహాలో దుగ్గొండి, ఆత్మకూర్, మామునూర్, ములుగు, హుజూరాబాద్, చిగురుమామిడి, సుల్తానాబాద్, జనగామలోను కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు పీడీ యాక్టు నమోదు చేశారు. వరంగల్ సీపీ ప్రమోద్కుమార్ ఆదేశాలతో వరంగల్లోని ఏకశిలానగర్లో ఉంటున్న నిందితుడికి జనగామ రూరల్ సీఐ బాలాజీవరప్రసాద్ ఉత్తర్వులు అందజేసి సెంట్రల్ జైలుకు తరలించారు.
తాజావార్తలు
- రిపబ్లికన్ నేత ట్విట్టర్ అకౌంట్ లాక్.. ఎందుకో తెలుసా ?
- బూర్గుల నర్సింగరావు మృతి.. కేటీఆర్ సంతాపం
- కమెడీయన్స్ గ్రూప్ ఫొటో.. వైరల్గా మారిన పిక్
- ఇక మీ ఇష్టం.. ఏ పార్టీలో అయినా చేరండి!
- వాఘాలో ఈ సారి బీటింగ్ రిట్రీట్ ఉండదు..
- గుంటూరు జిల్లాలో విషాదం.. ప్రేమజంట ఆత్మహత్య
- ప్రత్యేక గుర్తింపుకోసమే అంగన్వాడీలకు యూనిఫాం
- భార్యలతో గొడవపడి ఇద్దరు భర్తల ఆత్మహత్య
- పెంపుడుకుక్కకు అంత్యక్రియలు...!
- తెలుగు ప్రజల ఆరాధ్యదైవం ‘అన్న’ కన్నుమూత
MOST READ
TRENDING