హుజూర్నగర్: సొంత పార్టీలో ఎప్పటినుంచో ఉన్న వారిని వదిలేసి దిగుమతి ఐన నాయకుడికి పీసీసీ అధ్యక్ష పదవిని కట్టబెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీ దక్కించుకున్నదని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో టీఆర్ఎస్ పార్టీ హుజూర్నగర్ నియోజకవర్గ కార్యకర్తల విస్త్ర త స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ రేవంత్రెడ్డి పెద్ద బ్లాక్ మెయిలరని ఆయనకు పీసీసీ ఇవ్వడంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా బ్లాక్ మెయిల్ పార్టీ అయిపోయిందన్నారు.
ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలను చేస్తూ, సీఎం కేసీఆర్ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. దళిత బంధుపై విమర్శలు చేస్తున్న వారు ఆ పథకం అమలవుతున్న తీరును చూసి ముక్కు మీద వేలేసుకుంటున్నార న్నారు. జాతీయ పార్టీ అధ్యక్షుడు ఎందుకు పాదయాత్ర చేస్తున్నాడో జనాలకు చెప్పలేకపోతున్నాడన్నారు. దేశంలో ఎక్క డా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. కులాల మతాలకు అతీతంగా ప్రజలకు అక్కున చేర్చుకుని వారికి ఏం కావాలో వాటిని అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనని అన్నారు.