మేడ్చల్ మల్కాగిరి : అనుమానాస్పద స్థితిలో ఒ వ్యక్తి మృతి చెందిన సంఘటన జిల్లాలోని జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్నగర్ కార్పొరేషన్ నందమూరి నగర్ కాలనీలో సునీల్ (35) ఓ ఇంట్లో ఒంటరిగా నివాసముంటున్నాడు. కాగా బుధవారం తెల్లవారు జామున సునీల్ తను నివాసం ఉంటున్న ఇంటి బయట ఒంటిపై గాయాలతో పడి ఉన్నాడు.
గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సునీల్ను పరిశీలించి మృతి చెందినట్లుగా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా, పథకం ప్రకారమే కొంత మంది సునీల్ను హత్య చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.