తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది హీరోలు కేవలం నటన మాత్రమే కాకుండా బిజినెస్ కూడా చేస్తున్నారు. ఇక్కడ సంపాదించిన డబ్బులు మరో చోట పెట్టి రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఈ క్రమంలోనే థియేటర్ బిజినెస్ మొదలుపెట్టారు కొందరు హీరోలు. ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలో మహేష్ బాబు ఏఎంబీ సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్ వ్యాపారంలో కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాడు. మహేష్ బాగస్వామి కావడంతో దేశవ్యాప్తంగా ఏఎంబీ సినిమాస్ గురించి చర్చ జరిగింది. భారీ స్క్రీనింగ్, అద్భుతమైన సీటింగ్తో ఇండియాలో వన్ అఫ్ ద బెస్ట్ మల్టీప్లెక్స్గా పేరు తెచ్చుకుంది ఏఎంబీ సినిమాస్. ఈయనతోపాటు వెంకటేష్, వినాయక్, ప్రభాస్ లాంటి సినీ ప్రముఖులకు కూడా సొంత థియేటర్స్ ఉన్నాయి.
ఇక ఇప్పుడు వీళ్ల దారిలోనే విజయ్ దేవరకొండ కూడా వెళ్తున్నాడు. ఈయన కూడా మల్టీప్లెక్స్ బిజినెస్లోకి ఎంటర్ అవుతున్నాడు. ఇప్పటికే రౌడీ వేర్ అంటూ బట్టల బిజినెస్లో సంచలనం సృష్టించాడు విజయ్ దేవరకొండ. ఇప్పుడు మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి కూడా వస్తున్నాడు. మరో ప్రముఖ సంస్థ ఏషియన్ సినిమాస్ తో కలిసి ఒక భారీ మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నాడు విజయ్. తెలంగాణలోని మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్న తిరుమల థియేటర్ పూర్తిగా మాడిఫై చేస్తూ దానికి AVD సినిమాస్ అని నామకరణం చేశారు.
అంటే ఏషియన్ విజయ్ దేవరకొండ సినిమాస్ అని అర్థం. ఇందులో విజయ్ కూడా భారీగానే పెట్టుబడి పెట్టాడు. ఇప్పటికే ఈ థియేటర్ నిర్మాణం చివరి దశకు వచ్చింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఏప్రిల్ 9న పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో దీని ప్రారంభించాలని చూస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఓపెనింగ్కు విజయ్ దేవరకొండ కూడా వస్తున్నాడు. ఇక ఈయన కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమాలో నటిస్తున్నాడు.