మాడ్గులపల్లి/తిరుమలగిరి సాగర్, ఏప్రిల్ 8 : నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దుమ్ముకొట్టుకుపోవడం ఖాయమని, జానారెడ్డి గతంలో చేసిన అభివృద్ధి ఏమీలేక చెప్పుకోవడం లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. గురువారం మాడ్గులపల్లి మండలంలోని ధర్మాపురంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 60ఏండ్ల కాంగ్రెస్ పాలనలో నియోజకవర్గం ఎంతో వెనుకబడిందన్నారు. 7సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జానారెడ్డి సాగర్లో చేసిన అభివృద్ధి ఏమిటో చూపించాలని సవాల్ చేశారు. సీఎం కేసీఆర్కు మద్దతుగా ప్రజలంతా టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. నాయకులు యాదగిరెడ్డి, కొత్త శ్రీను, రామాంజిరెడ్డి, సైదులు పాల్గొన్నారు.