సంగారెడ్డి (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మెరుగైన విద్యను అంద జేయటంతోపాటు పాఠశాలల్లో విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం కల్పనపై దృష్టి సారించింది. ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇటీవలే జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఎలాంటి వసతులు కల్పించాలన్న అంశంపై సర్వే జరిపింది. సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టాల్సిన పను లపై అధికారులు సర్వే చేసి ప్రభుత్వానికి నివేదికను అందజేశారు.
ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం త్వరలో నిధులు కేటాయించనుంది.ప్రభుత్వం విద్యాశాఖ ద్వారా సమకూర్చే నిధులతో పా టు అదనంగా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల ప్రత్యేకంగా ఏటా కేటాయించే నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం(సీడీపీ) నిధుల నుంచి ఖర్చు చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఇటీవలే కీలకనిర్ణయం తీసుకుంది. ప్రతిఏటా ప్రభుత్వం ఎమ్మెల్సీ, ఎ మ్మెల్యేలకు సీడీపీ కింద రూ.5 కోట్ల నిధులు కేటాయిస్తోంది. ఈ రూ.5 కోట్ల నిధుల నుంచి 40 శాతం నిధులు తప్పనిస రిగా ప్రభుత్వ, జిల్లా పరి షత్ పాఠశాలల్లో మౌళికవసతులకు ఖర్చు చేయాలని మార్గదర్శకాలను విడుదల చేసింది.
ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి జిల్లాలోని ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పనకు ఏటా రూ.2 కోట్లు నిధులు ఖర్చు చేయ నున్నారు. సీడీపీ నిధులతో అదనపు గదుల నిర్మా ణం, టాయిలెట్లు, తాగునీటి సరఫరా తదితర పనులు చేపట్టనున్నారు. జిల్లాలో ఎమ్మెల్సీ, శాసనమండలి చైర్మన్ వి.భూ పాల్రెడ్డితోపాటు జిల్లాలోని ఐదుగురు ఎమ్మెల్యేలు తమ సీడీపీ నిధుల నుంచి 40 శాతం నిధులు ప్రభుత్వ పాఠశాలలోల మౌలిక వసతులకు ఖర్చు చేయనున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలకు సీడీ పీ నిధులు రూ.5 కేటాయించారు. దీంతో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నారు. ఎమ్మెల్సీ, ఎమ్మె ల్యేలకు కేటాయించిన నిధుల్లో సింహాభాగం రూ.2 కోట్లు చొప్పున తమ నియోజకవర్గాల్లో పాఠశాలల అభివృద్దికి ఖర్చు చేయనున్నారు.
పాఠశాలల్లో తీరనున్న మౌలిక వసతుల కొరత
ప్రభుత్వం సాలీనా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కేటాయించే నిధులతోపాటు అదనంగా సీడీపీ నిధుల నుంచి ప్రతి ఏటా ఎమ్మెల్యేలు రూ.2 కోట్లు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతు కల్పనకు కేటాయించనున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కొరత పూర్తిగా తీరనుంది. విద్యాశాఖ అధికారుల సమాచారం మేరకు జిల్లాలో 1261 ప్రభుత్వ పాఠశాలలు ఉ న్నాయి. ఇటీవల విద్యాశాఖ నిర్వహించిన సర్వేను అనుసరించి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో 530 అదనపు తరగతి గదులు నిర్మించిల్సిన అవసరం ఉంది. అలాగే 202 పాఠశాలల్లో తాగు నీటి సరఫరా సౌకర్యం కల్పించాలి. అలాగే 1039 టాయిలెట్లు నిర్మించాల్సి ఉంది. బాలుర కోసం 606, బాలికల కోసం 433 టాయిలెట్లు నిర్మాణం చేపట్టాలి.
అలాగే 578 పాఠశాలల్లో ప్రహారీల నిర్మాణం, 58 పాఠశాలల్లో కరెంటు సౌకర్యం కల్పించాల్సి ఉంది. ఆయా పనులు చేపట్టేందుకు విద్యాశాఖ ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. అలాగే జిల్లాలోని విద్యార్థులను క్రీడలవైపు మళ్లించేందుకు 678 పాఠశాలల్లో క్రీడా మైదానాల నిర్మాణాల నిర్మాణం చేపట్టాలని విద్యాశాఖ ప్రభుత్వంను కోరింది. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే రూ.2 కోట్ల చొప్పున సీడీపీ నిధులతో తమ నియోజకవర్గాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, ప్రహారీలు, టాయిలెట్లు, తాగునీటి సరఫరా, క్రీడామైదానాల నిర్మాణం తదితర పనులు చేపట్టనున్నారు.