హైదరాబాద్: రాష్ట్రంలో పగటిపూట లాక్డౌన్ను ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో ప్రజలకు అన్నిరకాల సాధారణ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా పోస్టాఫీసుల్లో పాస్పోర్ట్ సేవలను పునరుద్ధరించారు. నేటినుంచి అవి ప్రారంభంకానున్నాయి. లాక్డౌన్ కారణంగా గత నెల 12న ఈ పాస్పోర్ట్ సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. అత్యవసరంగా విదేశాలకు వెళ్లేవారికి లాక్డౌన్లో ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేశారు. అయితే లాక్డౌన్ సడలింపులతో తపాలా కార్యాలయాల్లో సేవలు ప్రారంభిస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ సేవలు సాధారణ సమయాల్లో అందుబాటులో ఉంటాయన్నారు.