హైదరాబాద్ : కొవిడ్ ఉధృతి దృష్ట్యా పాస్పోర్టు కార్యాలయ పని వేళల్లో మార్పులు చేసినట్లు సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్పోర్టు అధికారి బాలయ్య ప్రకటించారు. అపాయింట్మెంట్లు, స్లాట్లు యథాతథంగా ఉంటాయన్నారు. తత్కాల్ పాస్పోర్టులు, పీసీసీ స్లాట్లు సగానికి కుదించినట్లు పేర్కొన్నారు. సికింద్రాబాద్ ప్రజా విచారణ కేంద్రం సమయాన్ని ఉదయం 9:30 నుంచి 11:30 గంటల వరకు సమయాన్ని కుదించారు. పాస్పోర్టు సేవా కేంద్రాలు, పోస్టాఫీస్ పాస్పోర్టు సేవా కేంద్రాల్లో కూడా మార్పులు చేశారు. తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు ఈ మార్పులు అమల్లో ఉంటాయని బాలయ్య ప్రకటించారు.