లోక్సభలో టీఆర్ఎస్ పక్షనేత నామా నాగేశ్వరరావు
హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): పట్టణ ప్రాంతాల్లో 2022 నాటికి ప్రతి ఒకరికీ ఇల్లు నిర్మించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై-యూ) లక్ష్యం నెరవేరిందా అని టీఆర్ఎస్ లోక్సభ పక్షనేత నామా నాగేశ్వరరావు ప్రశ్నించారు. పట్టణ ప్రాంతాల్లో ఈ పథకం పురోగతి వివరాలను తెలియజేయాలని గురువారం లోక్సభలో అడిగారు. కేంద్రం గృహ, అర్బన్ వ్యవహారాల సహాయ మంత్రి కౌషల్ కిశోర్ సమాధానం ఇస్తూ.. దేశంలో మురికివాడల అభివృద్ధే లక్ష్యంగా ఎంపీఏవై-యూ ప్రారంభించామని, పారదర్శకంగా లబ్ధిదారులకు చెల్లింపులు జరుగుతున్నాయని వివరించారు. జాతీయ నీటి నాణ్యత పర్యవేక్షణ కార్యక్ర మం కింద పర్యవేక్షణ స్టేషన్లు, నీటి నాణ్యత పర్యవేక్షణ ఫలితాల ఆధారంగా నదుల కాలుష్య అంచనాను సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా నిర్వహిస్తున్నామని జల్శక్తి, ఫుడ్ ప్రాసెసింగ్ సహాయ మంత్రి సమాధానమిచ్చారు. 45 ఎంజీ కంటే ఎకువ నైట్రేట్ గాఢత కలిగిన నీటిని తాగడానికి అనుమతించడం లేదని చెప్పారు.