వరంగల్ రూరల్ : కరోనా కష్టకాలంలో పేదలకు తమ వంతు సాయం అందించడానికి పరకాల పోలీసులు ముందుకొచ్చారు. పరకాల పట్టణంలోని ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుంచి పేద కరోనా బాధితులకు స్థానిక పోలీసులు ఉచిత రవాణా సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఈ దవాఖాన నుంచి కరోనా బాధితులను ఉచితంగా వారి ఇండ్లకు చేర్చేందుకు ప్రత్యేకంగా ఒక వాహనం సమకూర్చారు. దీనిని ఈస్ట్ జోన్ డీసీపీ వెంకటలక్ష్మి ప్రారంభించారు. కాగా, కష్టకాలంలో పేదలకు అండగా నిలుస్తున్న స్థానిక పోలీసులను పలువురు అభినందించారు. కార్యక్రమంలో పరకాల ఏసీపీ శ్రీనివాస్ తో పాటు పోలీసు అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ధైర్యం కోల్పోవద్దు..నిర్లక్ష్యం చేయొద్దు
వైద్యుల సేవలు వెలకట్టలేనివి : మంత్రి నిరంజన్ రెడ్డి
కొవిడ్ బాధితులకు అండగా ఉంటాం : మంత్రి ఎర్రబెల్లి
సిద్దిపేట లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం
మనోధైర్యమే అసలైన మందు : మంత్రి నిరంజన్ రెడ్డి