కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతుండటంతో ఆ రాష్ర్టంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో తొలి దశ ఎన్నికలు పూర్తి కాగా, ఇప్పటి వరకు రూ. 248.9 కోట్లు సీజ్ చేసినట్లు ఎన్నికల అధికారి సంజోయ్ బసు వెల్లడించారు. ఇందులో రూ. 37.72 కోట్ల నగదు, రూ. 9.5 కోట్ల విలువ చేసే మద్యం, రూ. 114.44 కోట్ల విలువ చేసే డ్రగ్స్తో పాటు ఇతర వస్తువులను సీజ్ చేశారు.
శనివారం జరిగిన తొలి దశ ఎన్నికల్లో మొత్తం 30 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించారు. 79.79 శాతం పోలింగ్ నమోదైంది. 30 నియోజకవర్గాల్లో మొత్తం 191 మంది పోటీ చేయగా, ఇందులో 21 మంది మహిళలు ఉన్నారు. బెంగాల్లో చివరి దశ ఎన్నికలు ఏప్రిల్ 29న జరగున్నాయి. ఓట్ల లెక్కింపు మే 2న చేపట్టనున్నారు. బెంగాల్లో మొత్తం శాసనసభ స్థానాల సంఖ్య 294.
ఇవి కూడా చదవండి..