సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు(ఈడబ్ల్యూఎస్) పదిశాతం రిజర్వేషన్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం పట్ల బ్రహ్మణ సేవా సమితి హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు కృతజ్ఞతలు తెలుపుతూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసింది. ఈడబ్ల్యూఎస్ అమలుతో ఖమ్మ, రెడ్డి, వెలమ, వైశ్య, బ్రాహ్మణ వంటి అగ్ర వర్ణాలలోని పేదలకు విద్య, వైద్య, ఉపాధి రంగాల్లో అవకాశాలు లభిస్తాయన్నారు. భారత ప్రభుత్వం, సుప్రీంకోర్టు సమర్థించిన ఈడబ్ల్యూఎస్ ప్రకారంగా 10 శాతం రిజర్వేషన్లను అమలు పర్చాలని నిర్ణయం తీసుకోవడం పట్ల సీఎంకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర అధికారులు, జిల్లాస్థాయి కలెక్టర్లకు తగు మార్గదర్శకాలు జారీచేయాల్సిందిగా కోరారు. సీఎం కేసీఆర్ ఇప్పటికే బ్రహ్మణ సంక్షేమం పట్ల నిధులు కేటాయించి వారి అభ్యున్నతికి తోడ్పడ్తున్నారని బ్రహ్మణ సేవా సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గంగు ఉపేంద్రశర్మ పేర్కొన్నారు.
తాజావార్తలు
- కివీస్తో టీ20.. 50 రన్స్ తేడాతో ఆసీస్ విజయం
- తాండవ్ వివాదం : అమెజాన్ ప్రైమ్ ఇండియా హెడ్ అపర్ణా పురోహిత్కు బెయిల్!
- పంత్ హాఫ్ సెంచరీ.. ఆధిక్యంపై కన్నేసిన భారత్
- క్రెడిట్ కార్డు సైజ్లో ఆధార్.. అప్లై ఎలా చేయాలంటే..
- ప్రధాని గడ్డంపైనా అర్థంపర్థం లేని వ్యాఖ్యలు: కర్ణాటక సీఎం
- కిస్ సీన్లలో నటించేందుకు రెడీ అంటోన్న అమలాపాల్..!
- కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న గవర్నర్
- రోజూ పెరుగు తింటే జీర్ణ సమస్యలు దూరం..!
- వర్చువల్గా భేటీకానున్న బైడెన్, మోదీ
- ప్రియుడితో పారిపోయిన కుమార్తె.. హత్య చేసిన తండ్రి