వరంగల్ అర్బన్ : ఈ నెల 28 నుంచి సూపర్ స్పైడర్ వ్యాక్సినేషన్ వేసేందుకు పక్కా ప్రణాళిక రూపొందించాలని గ్రేటర్ కమిషనర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. మంగళవారం కమిషనర్ క్యాంప్ కార్యాలయంలో ఆమె అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 28 వ తేదీ నుంచి 20 రోజుల పాటు సూపర్ స్పైడర్ వ్యాక్సినేషన్ వేసేందుకు నగరంలో 5 వాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఖిలా వరంగల్, వరంగల్, హన్మకొండ, ఖాజీపేట్, భీమారంలలో కొవిడ్ నిబంధనలు పాటించేలా సువిశాలమైన ప్రదేశాలలో లేదా ఫంక్షన్ హాల్ లలో వాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ప్రతి కేంద్రంలో 13 డివిజన్ల పరిధిలోని స్పైడర్ వ్యాక్సినేషన్ వాక్సిన్ వేసేలా మ్యాపింగ్ చేయాలని సూచించారు.
రెవెన్యూ ఇన్స్పెక్టర్, హెల్త్ అసిస్టెంట్, ఎస్ఐ, ఆర్ఐ, బిల్ కలెక్టర్, మెప్మా సీఓలతో బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ బృందాలు నగరంలోని సూపర్ స్పైడర్ లు అయిన రైతు బజార్, వెజ్, నాన్ వెజ్, పండ్లు, చేపలు, మాంసం, చికెన్ మార్కెట్ లు, వీధి వ్యాపారులు, కిరాణా, వైన్, ఐరన్ హార్డ్వేర్ దుకాణాలు, సెలూన్లలో పనిచేసే వారిని గుర్తించి వారి వివరాలు సేకరించి వెంటనే సమర్పించాలన్నారు. గుర్తించిన వారికి వాక్సినేషన్ చేయు ప్రదేశం, తేదీ, సమయం వివరాల టోకెన్లు అందచేయాలన్నారు.
సమావేశంలో సీఎం హెచ్ఓ డాక్టర్ రాజి రెడ్డి, డిప్యూటీ కమిషనర్లు జోనా, రవీందర్ యాదవ్, శాంతి కుమార్, ఈఈలు శ్రీనివాస్, ప్రవీణ్ కుమార్, డీఈ లు రవి కుమార్, రవీందర్, సంజయ్, శానిటరీ సూపర్ వైజర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
యాదాద్రిలో ముగిసిన జయంత్యోత్సవాలు
కరోనాకు మనో ధైర్యమే మందు : ఎమ్మెల్యే చల్లా
ధాన్యం నిల్వల కోసం ప్రభుత్వ భవనాలను వినియోగించండి
ఆన్లైన్ బ్యాంకింగ్లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
కాశయ్య మృతి పట్ల మంత్రి పువ్వాడ సంతాపం