మంత్రి గంగులకు తీర్మాన ప్రతి అందజేత
హుజూరాబాద్, సెప్టెంబర్ 7: పద్మశాలీ కులస్థులు టీఆర్ఎస్కు బాసటగా నిలిచారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను గెలిపించుకుంటామని ప్రతినబూనారు. మంగళవారం హుజూరాబాద్లో జరిగిన పద్మశాలీల ఆత్మీయ సమ్మేళనంలో టీఆర్ఎస్కు మద్దతుగా చేసిన తీర్మానం ప్రతిని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్కు అందజేశారు. అనంతరం మంత్రి గంగుల మాట్లాడుతూ.. ప్రభుత్వం పద్మశాలీల సంక్షేమానికి కృషి చేస్తున్నదని చెప్పారు. పట్టణంలో పద్మశాలీల ఆత్మగౌరవ భవన నిర్మాణానికి ఎకరం స్థలంతోపాటు రూ.కోటి నిధులు కేటాయించగా, భూమిపూజ చేసినట్టు తెలిపారు. పద్మశాలీల సంక్షేమపథకాలకు పెండింగ్లో ఉన్న రూ.74 కోట్ల నిధులు మంజూరు చేశామని చెప్పారు. పద్మశాలీలు ఆర్థికంగా ఎదిగేందుకు రూ.లక్ష వ్యక్తిగత రుణాల మంజూరును ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ పాల్గొన్నారు.