హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలపై పీఏసీ శాసనసభా కమిటీ మంగళవారం అసెంబ్లీ కమిటీహాల్లో సమావేశమైంది. చైర్మన్ అక్బరుద్దీన్ ఒవైసీ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ విద్యార్థుల ఉపకారవేతనాలపై ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. సమావేశంలో సభ్యులు శంభీపూర్ రాజు, డీ రాజేశ్వర్రావు, మహమ్మద్ జాఫ్రీ, శ్రీధర్బాబు, గాదరి కిషోర్కుమార్, బిగాల గణేశ్, రవీంద్రకుమార్, జీ విఠల్రెడ్డి, జీ జైపాల్యాదవ్తోపాటు ఏజీ అనింద్యాదాస్ గుప్తా, డీప్యూటీ ఏజీ శరణ్య, సంక్షేమశాఖ కార్యదర్శులు రాహుల్బొజ్జా, అహమ్మద్ నదీమ్, శ్రీదేవి, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వీ నర్సింహాచార్యులు పాల్గొన్నారు.