నాగర్ కర్నూల్ : జిల్లా దవాఖానకు ఆక్సిజన్ ప్లాంట్ మంజూరు అయినందున దవాఖాన ఆవరణలో ప్లాంట్ ఏర్పాటుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శర్మన్ వైద్య అధికారులను ఆదేశించారు. గురువారం ప్రభుత్వ దవాఖానను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొవిడ్ వార్డులో డ్యూటీ డాక్టర్ లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అదనపు కలెక్టర్ ఉదయాన్నే 7 గంటలకు దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేశారని అప్పుడు డ్యూటీ డాక్టర్ లేకపోవడం, ఆక్సిజన్ మానిటరింగ్ సైతం రోగుల వెంట వచ్సిన అటెండెంట్స్ చేసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఎంతో విలువైన ఆక్సిజన్ ను ఎవరు బడితే వారు మానిటరింగ్ చేస్తున్నప్పుడు వైద్య సిబ్బంది ఏంచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటివరకు దవాఖాన సూపరిండెంట్ ఎందుకు రాలేదని సిబ్బందిని ప్రశ్నించారు. మరోసారి ఇలాంటి నిర్లక్ష్యం తన దృష్టికి వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
వారం పది రోజుల్లో ఇక్కడే ఆక్సిజన్ ఉత్పత్తి ప్రారంభం అయ్యే విధంగా యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. సుధాకర్ లాల్, డా. రోహిత్, డా.ప్రభు ఇతర వైద్య సిబ్బంది కలెక్టర్ వెంట ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
మైనర్ వివాహాన్ని అడ్డుకున్న పోలీసులు
అంబులెన్స్లోనే కరోనా గర్భిణి ప్రసవం
సీఎం కేసీఆర్ వెంటే మంథని ప్రజలు
అజిత్ సింగ్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
కరోనా కష్టకాలంలో రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం