హైదరాబాద్ : కరోనా సెకండ్ వేవ్లో ఆక్సిజన్ కొరతతో చాలా మంది మరణిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆక్సిజన్ కొరతను తగ్గించడానికి తెలంగాణ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య(టీఐఎఫ్) స్పష్టం చేసింది. విదేశాల నుంచి దిగుమతి చేసిన 40 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ను ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్కు టీఐఎఫ్ ప్రతినిధులు అందించారు.
ఈ సందర్భంగా టీఐఎఫ్ కృషిని కేటీఆర్ ప్రశంసించారు. కరోనాను ఎదుర్కొనేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని, కరోనా రోగులను ఆదుకునేందుకు సహకారం అందించాలన్నారు.
ఈ కార్యక్రమంలో టీఐఎఫ్ అధ్యక్షులు కొండవీటి సుధీర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ మిరుపాల గోపాల్ రావు, సభ్యులు సీతాలా శంకర్ రావు పాల్గొన్నారు.