సిరిసిల్ల టౌన్, మార్చి16: స్వచ్ఛతలో సిరిసిల్ల మున్సిపాలిటీని దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని 39వ వార్డులో రూ.3 లక్షల మున్సిపల్ నిధులతో ఏర్పాటు చేస్తున్న మురుగు కాలువ నిర్మాణ పనులను కౌన్సిలర్ ఆకుల కృష్ణతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ ఆశయానికి అనుగుణంగా పట్టణంలోని అన్ని వార్డుల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇక్కడ వైస్చైర్మన్ మంచె శ్రీనివాస్, కమిషనర్ వెల్దండి సమ్మయ్య, మున్సిపల్ కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.