వరంగల్ : కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి ఎంజీఎంలో ఓపీ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. సాధారణ వార్డులో ఎమర్జెన్సీ రోగులకు సేవలందిస్తామని తెలిపారు. కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయిన రోగులకు ఎంజీఎంలో పూర్తి స్థాయి చికిత్స అందించనున్నారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఓపీ సేవలను నిలిపివేస్తున్నట్లు సూపరింటెండెంట్ స్పష్టం చేశారు.