జడ్పీ సీఈవో అప్పారావు
చిన్నగూడూరు ఏప్రిల్ 30 : కొవిడ్పై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జడ్పీ సీఈవో అప్పారావ్ సూచించారు. మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఏర్పాటు చేసిన కరోనా ఐసొలేషన్ సెంటర్ను స్థానిక అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్య లక్షణాలున్న వ్యక్తులు పీహెచ్సీలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గ్రామాల్లో మాస్కులు లేకుండా వీధుల్లో తిరిగే వారికి విధిగా జరిమానా విధించాలన్నారు. వివాహాలు, ఇతర శుభకార్యాలు చేసేవారు అధికారుల అనుమతి తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కోమల, ఎంపీడీవో సరస్వతి, ఆర్ఐ వెంకన్న, కార్యదర్శి అజీమ్ తదతరులు ఉన్నారు.
కరోనా బాధితులు ఆత్మైస్థెర్యాన్ని కోల్పోవద్దు
పెద్దవంగర: కరోనా బాధితులు మనోధైర్యాన్ని కోల్పోవద్దని.. ఆత్మైస్థెర్యంతో ఉండాలని మండల ప్రత్యేకాధికారి రావూరి రాజు సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలో కేజీబీవీలో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ కేంద్రం లో ఉన్న బాధితుడి ఆరోగ్య స్థితిని అడిగి తెలుసుకుని, వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలని సూచించారు. వ్యాక్సిన్పై అపోహలు వద్దని తప్పని సరిగా ప్రజ లు స్వచ్ఛందంగా టీకా వేసుకోవాడానికి ముందుకు రావాలన్నారు. డాక్టర్ వేదకిరణ్, ఆర్ఐ సాయిబాబా, రెవెన్యూ, వైద్యసిబ్బంది, తదితరులు ఉన్నారు.
కరోనా బాధితులు ధైర్యంగా ఉండాలి ..
నర్సింహులపేట: కరోనా బాధితులు ధైర్యంగా ఉండాలని తహసీల్దార్ ఇమానుయెల్ సూచించారు. మండలంలోని పడమటిగూడెంలో హోం హైసొలేషన్లో ఉండి శ్వాసతో ఇబ్బంది పడుతున్న వారిని జిల్లా కేంద్రంలోని క్వారంటైన్కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోం క్వారంటైన్లో ఉన్న వ్యక్తులకు ఎలాంటి ఇబ్బందు లు వచ్చినా వెంటనే వైద్యాధికారులకు సమాచారం అం దించాలని సూచించారు. ఎంపీడీవో సత్యనారాయణారెడ్డి, ఎంపీవో సోంలాల్, ఏఎన్ఎం, ఆశ కార్యకరలు ఉన్నారు.
కొవిడ్పై కళాకారుల కళాజాత..
పెద్దవంగర, ఏప్రిల్ 30 : మండల కేంద్రంలో తెలంగాణ జాగృతి కళాబృందం జబర్దస్ ఫేం రాజమౌళి మండల ప్రత్యేకాధికారి రాజు ఆధ్వర్యంలో కొవిడ్పై కళాజాత నిర్వహించి, ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శుక్రవారం వారు మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో కరోనాపై ప్రజలకు అవగాహన ఎంతో అవసరమన్నారు. కరోనా బాధితులు బహిరంగ ప్రదేశాల్లో తిరుగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని, భౌతిక ధూరం పాటించాలని సూచించారు. సర్పంచ్ చింతల భా స్కర్రావు, ఎంపీటీసీ అనురాధ, పీ దేవస్థాన చైర్మన్ రామచంద్రయ్యశర్మ, డాక్టర్ వేదకిరణ్, ఎంపీవో యాకయ్య, ఆర్ఐ సాయిబాబా, కళాబృందం సభ్యులు వెంకన్న, కవిత, అశ్విని, భరత్ తదితరులు ఉన్నారు.
331 మందికి వ్యాక్సినేషన్
దంతాలపల్లి: కరోనా రోజు రోజుకూ విజృంభిస్తున్నందున వ్యాక్సినేషన్ ఆరోగ్య శాఖ వేగవంతం చేసింది. దంతాలపల్లి పీహెచ్సీలో శుక్రవారం 331 మంది వ్యాక్సిన్ వేశా రు. దంతాలపల్లి మండలంలోని 219 మంది, నర్సింహులపేటలో 112 మందికి వ్యాక్సిన్ వేసినట్లు వైద్యుడు సతీశ్ తెలిపారు.