ఆత్మకూరు, మే 23 : కరోనా కట్టడిని మరింత పకడ్బందీగా అ మలు చేయాలని ప్రజాప్రతినిధులకు, అధికారులకు కలెక్టర్ హ రిత ఆదేశించారు. ఆదివారం ఆత్మకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలపై ఆరా తీశారు. కొవిడ్ బాధితులను క లెక్టర్ హరిత, డీఎంహెచ్వో చల్లా మధుసూధన్, వరంగల్ ఆర్డీ వో మహేందర్జీ ఆరోగ్య స్థితి తెలుసుకున్నారు. వైద్యుల సూచనులు పాటిస్తూ ధైర్యంగా ఉండాలని సూచించారు. అనంతరం ఆత్మకూరు, గూడెప్పాడ్ గ్రామంలో నిర్వహిస్తున్న లాక్డౌన్ తీరును పరిశీలించారు. ఆత్మకూరు మండల కేంద్రంలో కరోనా విజృంభిస్తున్నందున తీరును సర్పంచ్ రాజును అడిగి తెలుసుకున్నారు. కొవిడ్ బాధితుల గ్రామాల్లో తిరుగుతున్నట్లు సమాచారం వస్తే.. వారిపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ సురేశ్ను ఆదేశించారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ నియంత్రణలో భాగ స్వాములవ్వాలని సూచించారు.
ఐసొలేషన్ కేంద్రం పరిశీలన..
మండల కేంద్రంలో కరోనా బాధితుల కోసం ఐసొలేషన్ కేం ద్రాన్ని ఏర్పాటు చేసిన సర్పంచ్ పర్వతగిరి రాజును కలెక్టర్ హ రిత అభినందించారు. కరోనా బాధితులకు అయ్యే ఖర్చును తనే భరిస్తానని హామీ ఇచ్చారు. తహసీల్దార్ సురేశ్కుమార్, ఎంపీవో ప్రభాకర్రావు, వైద్యాధికారి రణధీర్, ఆర్ఐ రమేశ్, పీఏసీఎస్ చైర్మన్ ఏ రవీందర్, మాజీ ఎంపీటీసీ పీ వాసు, పీఏసీఎస్ డైరెక్టర్లు జయపాల్రెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
జ్వర బాధితులకు కరోనా పరీక్షలు
దామెర : జ్వర బాధితులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని కలెక్టర్ హరిత వైద్యాధికారులకు సూచించారు. ఆదివారం దామెర మండలం ఊరుగొండలోని పీహెచ్సీ సబ్సెంటర్ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటింటి సర్వేలో జర్వం, దగ్గుతో బాధపడుతున్న వారందరికీ కరోనా పరీక్షలను చేసి మందులను అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీ పీ జాకీర్ అలీ, సర్పంచ్ సత్యనారాయణ రెడ్డి, ఉపసర్పంచ్ విద్యాసాగర్, పీఏసీఎస్ చైర్మన్ బొల్లు రాజు, డీఎంహెచ్వో మధసూదన్, ఆర్డీవో మహేందర్జీ, తహసీల్దార్ రియాజొద్దీన్, ఎంపీడీవో వెంకటేశ్వర్రావు, శిరీష, కమల్చంద్ నాయక్, ఏవో శ్వేత, పంచాయతీ కార్యదర్శి సునీల్, వీఆర్వో బాబు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.