చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ మరో అద్భుత విజయం సాధించింది. సన్రైజర్స్ హైదరాబాద్తో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్లో ఢిల్లీ సూపర్ ఓవర్లో గెలుపొందింది. ఆదివారం మొదట ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్లకు 159 పరుగులు చేసింది. అనంతరం విలియమ్సన్(66 నాటౌట్) రాణించడంతో హైదరాబాద్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులే చేయడంతో మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ ఏడు పరుగులు చేసింది. అనంతరం ఆ లక్ష్యాన్ని ఢిల్లీ ఛేదించి మ్యాచ్లో గెలిచింది. ఈ సీజన్లో ఇదే తొలి సూపర్ ఓవర్.