న్యూఢిల్లీ : అనాథలను ఆదుకోవడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని, అదే సమయంలో వారికి కూడా హక్కులు ఉంటాయనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) సూచించారు. తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యులు బండా ప్రకాష్ ఆధ్వర్యంలో పలువురు అనాథలు సోమవారం సాయంత్రం ఉపరాష్ట్రపతిని కలిశారు. తమ హక్కులకు సంబంధించిన చట్టం విషయంలో సహకారం అందించాల్సిందిగా కోరారు.
ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన ఉపరాష్ట్రపతి, ప్రభుత్వంలోని పెద్దలు, సంబంధిత మంత్రులతో తప్పకుండా మాట్లాడతానని హామీ ఇచ్చారు.
అయితే ఇది కేవలం చట్టాలతో రావలసిన మార్పు కాదని, సమాజంలో ప్రతి ఒక్కరూ ఇలాంటి వాటిని తమ బాధ్యతగా గుర్తించాలని ఆకాంక్షిస్తున్నట్లు వెంకయ్యనాయుడు తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వేతర సేవా సంస్థల ద్వారా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, ప్రభుత్వం వైపు నుంచి ఇవి తక్కువగానే ఉన్నాయన్నారు. ఇది మరింత పెరిగేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని సూచించారు.
తమ కుమార్తె దీపావెంకట్ అనాథలైన ఐదుగురు పిల్లలకు స్వర్ణభారత్ ట్రస్ట్ ద్వారా ఆశ్రయం ఇచ్చి వారి బాగోగులు, చదువు విషయంలో చొరవ తీసుకున్న విషయాన్ని ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా ప్రస్తావించారు. మనకున్న దానిలో నలుగురికీ సాయం చేయడం ఎంతో ఆనందాన్ని అందిస్తుందని చెప్పారు. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ దిశగా ముందుకు రావాలని సూచించారు. అనంతరం ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో వెంకయ్యనాయుడు చర్చించారు.
దోమల జనాభా నియంత్రణ ద్వారా మలేరియాకు చెక్!
కరోనా వ్యాక్సిన్తో క్యాన్సర్కు అడ్డుకట్ట
పారాలింపిక్ షూటర్కు ‘సుప్రీం’లో ఊరట
పెగాసస్పై దర్యాప్తు చేయాలి : సీఎం నితీష్ కుమార్
ఇక్కడ ముద్దులు నిషేధం.. ముంబైలో స్పెషల్ జోన్
ఈ చట్టం కింద ఇంకా కేసులా?.. సుప్రీంకోర్టు షాక్
స్పెషల్ ఒలింపిక్స్లో ఇండియాకు సోనూ సూద్ నాయకత్వం
చరిత్రలో ఈరోజు.. భారత ప్రభుత్వ చట్టం ఆమోదం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..