హైదరాబాద్ : బంజారాహిల్స్లోని మంత్రుల నివాస ప్రాంగణంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఉస్మానియా విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ డీ రవీందర్ మర్యాదపూర్వకంగా కలిశారు. దేశ, విదేశాల్లో ఉస్మానియా యూనివర్శిటీకి ఎంతో ప్రాధాన్యత ఉందని మంత్రి అన్నారు. విశ్వ విద్యాలయంలో చదువుతున్న విద్యార్థులకు ఉచిత ప్రమాణాలు కలిగిన విద్యను బోధించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని వీసీని మంత్రి ఎర్రబెల్లి కోరారు.
జనగామ జిల్లా వడ్లకోండ గ్రామానికి చెందిన ప్రొఫెసర్ డీ రవీందర్ను ప్రభుత్వం ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా నియమించిన విషయం తెలిసిందే.